IPL 2021 : నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం

-

ఇవాళ అబుదాది వేదికగా చెన్నై సూపర్ సింగ్స్‌తో, కోల్‌ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య 38 వ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. వరుస గెలుపు లలో గ్రూపులో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్… కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పైన కూడా అలవోకగా విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లు కోల్పోయి చేరుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్ రుతు రాజ్ గైక్వాడ్ 40 పరుగులు మరో ఓపెనర్ డుప్లెసిస్ 43 పరుగులు, మోయిన్ అలీ 32 పరుగులు ఇక చివర్లో రవీంద్ర జడేజా 22 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక అటు కోల్‌కతా  నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు కూడా బాగా రాణించారు. సునీల్ నరైన్ 3  వికెట్లు, ఫెర్గుసన్ 1, వరుణ్ చక్రవర్తి 1, ప్రసిద్ధ కృష్ణ ఒక వికెట్ తీసి… చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ లను ముప్పతిప్పలు పెట్టారు. కానీ చివరలో రవీంద్ర జడేజా మెరుపులతో… విజయం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ను వరించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news