మధ్యప్రదేశ్ లో దారుణం… 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

-

దేశంలో నానాటికి అత్యాచార ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారుల దగ్గర నుంచి నడి వయసు మహిళల దాకా కామాంధుల చేతిలో బలైపోతున్నారు. మరోవైపు పోలీసులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా, నిర్భయం, పోక్సో వంటి ఎన్నిచట్టాలు వచ్చినా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా 13 ఏళ్ల మూగచెవిటి బాలికపై అత్యాచారం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాహ్ దోల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికకు తెలిసిన అదే గ్రామానికి చెందిన ఆరుగురు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఘటన తర్వాత బాధితురాలు షాక్ కు గురైంది.

child rape cases

బాధితురాలు సైగల ద్వారా జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. దీంతో బాలిక తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన ఆరుగురిలో నలుగురు మైనర్లు ఉండటం గమనార్హం. ఘటనను దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితులందరిని పట్టుకున్నారు. నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news