వంగవీటి రాధాను హత్య చేయబోతున్నారు : చినరాజప్ప సంచలనం

-

వంగవీటి రాధాను హత్య చేయబోతున్నారని.. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని జగన్ కుట్ర చేస్తున్నారని చినరాజప్ప సంచలన వ్యాక్యలు చేశారు. నాడు రంగా హత్యను వైఎస్సార్ రాజకీయంగా వాడుకుంటే.. రాధాను హత్య చేసి..ఇప్పుడు వాడుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్ కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు మానుకోవాలని ఫైర్‌ అయ్యారు. రాధాను పార్టీలో చేర్చుకోవడం కాదు.. రెక్కి నిర్వహించిన.. కుట్ర పన్నిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని… రంగా హత్యకేసులో ప్రధాన ముద్దాయి దేవినేని నెహ్రూ కొడుకు అవినాశుకు వైసీపీలో పెద్ద పీట వేశారని నిప్పులు చెరిగారు.

Chinarajappa
Chinarajappa

రాధా హత్యకు రెక్కీ నిర్వహించిన అరవ సత్యం విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ అని చెప్పారు. వంగవీటి రంగాను హత మార్చడంలో తప్పులేదన్న గౌతం రెడ్డికి జగన్ ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ ఇచ్చారని.. రంగా హత్యతో టీడీపీకి సంబంధం లేదని వంగవీటి రాధా గతంలోనే బహిరంగ ప్రకటన చేశారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. రాధాను పార్టీలోకి ఆహ్వానిస్తామన్న వైసీపీ నేతలు.. అరవ సత్యం, అవినాషులను వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు.? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఇంకా రంగా హత్యను టీడీపీకి ఆపాదించి కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news