ప్రీ రిలీజ్‌ వేదిక మార్చడంపై చిరంజీవి హాట్‌ కామెంట్స్‌

-

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఇవాళ జరగనుంది. ఈ వేడుకను తోలుత ఆర్కే బీచ్ రోడ్ లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆదివారం సాయంత్రం బీచ్ రోడ్డుకు సందర్శకులు భారీగా వస్తారని, ట్రాఫిక్ సమస్యలు వస్తాయని పోలీసులు తెలిపారు.

దీంతో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఎయిర్‌పోర్టుకి బయల్దేరిన చిరంజీవి.. హైదరాబాద్ నుంచి విశాఖకి వెళ్లనున్నారు. సాయంత్రం వైజాగ్‌లో వాల్తేరు వీరయ్య ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి హాజరుకానున్నారు. వాళ్ల వీలును బట్టి పర్మిషన్‌ ఇస్తారని.. ఈ సందర్భంగా జగన్‌ సర్కార్‌పై చిరంజీవి కామెంట్స్‌ చేశారు. వేదిక మార్చడంపై మాత్రం చిరంజీవి… నో కామెంట్‌ అంటూ వెళ్లి పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news