ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, బాలకృష్ణ..‘ఆహా..అన్ స్టాపెబుల్ సీజన్ 2’ వేదికగా ముచ్చట్లు!

-

టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఒకే వేదికగా మీద కనబడితే అభిమానులు ఎంత సంబురపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా-నందమూరి అభిమానులు వీరిని చూసి మురిసిపోతారు. ఇటీవల కాలంలో బాలయ్య తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’AHAలో..‘అన్ స్టాపెబుల్’ షోతో అదరగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ షో సీజన్ 1 ముగియగా, సీజన్ 2 త్వరలో స్టార్ట్ కానుంది.

ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి సీజన్ 2ను స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ షోలో పలువురిని ఇంటర్వ్యూ చేసి వారిలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన బాలయ్య..ఈ సారి సీజన్ 2లో రెచ్చిపోనున్నారని చెప్పొచ్చు. సీజన్ 2 తొలి అతిథిగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. ఇందుకు చిరు..ఒప్పుకున్నారని వినికిడి.

ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IDMB) రేటింగ్స్ ..ప్లస్ సర్వేలో 9.7 రేటింగ్ తో బాలయ్య షో బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతున్నది. ఈ అన్ స్టాపెబుల్ షోతో ‘ఆహా’ ఓటీటీకి సబ్ స్క్రైబర్స్ ఎక్కువ మంది యాడ్ అయ్యారని టాక్. నందమూరి బాలయ్య, చిరంజీవి ప్రస్తుతం కుర్రహీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news