నేడు కామారెడ్డి జిల్లాకు చిరంజీవి, రామ్ చరణ్

-

కామారెడ్డి జిల్లాలో నేడు మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీ పర్యటించనుంది. కామారెడ్డి జిల్లాలోని.. దోమకొండ మండల కేంద్రంలోని గడికోట కు రానున్నారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు. మెగాస్టార్‌ చిరంజీవి తో పాటు రామ్ చరణ్, ఉపాసన కూడా రానున్నారు.

గడి కోట సంస్థానాధీశుల కామినేని అనిల్ కుమార్ శోభన రెండో కూతురు వివాహ సందర్భంగా పోచమ్మ పండుగ కు విచ్చేయనున్నారు మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ తో పాటు, కామినేని అపోలో కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలోనే… గండికోట లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా.. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో చిత్ర బృందం బిజీ గా ఉంది.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news