రాజ‌మండ్రిలో అల్లు రామ‌లింగ‌య్య విగ్రహాన్ని ఆవిష్క‌రించిన చిరంజీవి

-

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మెగాస్టార్ చిరంజీవి పర్యటించిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించిన మెగాస్టార్‌ చిరంజీవి…డాక్టర్‌ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్క‌రించారు. రాజమండ్రి లో ని డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Megastar Chiranjeevi resign to MAA

ఈ నేపథ్యం లోనే కాసేపటి క్రితమే అల్లు రామ లింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే 2 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రారంభించారు చిరంజీవి. ఇక అల్లు రామ లింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరన నేపథ్యం లో రాజమండ్రి మెగాస్టార్ చిరంజీవికి ఘన స్వాగతం లభించింది.

కాగా దివంగ‌త న‌టుడు జ‌యంతి సంధ‌ర్బంగా ఈరోజు ఆయ‌న మ‌న‌వ‌ళ్లు అల్లు స్టూడియోస్ లో సంద‌డి చేశారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ మ‌రియు అల్లు బాబీలు అల్లు స్టూడియోస్ లో అల్లు రామ‌లింగ‌య్య‌కు నివాళులు అర్పించారు. అంతే కాకుండా ఈ రోజు అల్లు రామ‌లింగయ్య విగ్రహాన్ని అల్లు స్టూడియోస్ లో ఆవిష్కిరించారు.

Read more RELATED
Recommended to you

Latest news