చిరంజీవి జోలికి వస్తే జగన్ ఊరుకుంటాడా ?? మొదలైంది అసలు రచ్చ!

-

తెలుగు చిత్ర పరిశ్రమ స్టార్ నటుడు మరియు మాజీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చిరంజీవి రాజకీయాలకు దూరంగా వచ్చేసి తన సినిమాల్లో బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి మనసు మళ్ళీ రాజకీయాల వైపు మళ్ళిందో లేదో తెలియదు కానీ రాజకీయ పరంగా మాత్రం అతని పై సోషల్ మీడియాలో ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. చాలా రోజుల నుండి జగన్ చిరంజీవికి రాజ్యసభ స్థానం ఇవ్వబోతున్నాడని వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన మరొక వార్త సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది

 

ప్రస్తుతం అమరావతి కి మద్దతుగా పోరాటం కొనసాగిస్తున్న వారంతా చిరంజీవి కూడా తమకు మద్దతు పలకాలని.. ఎక్కడో హైదరాబాదులో ఉన్న చిరంజీవి ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తామని జేఏసీ సభ్యులు తెలిపారు. వచ్చే ఫిబ్రవరి 29న ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరాహారదీక్ష చేసి చిరుని డిమాండ్ చేయాలని వారు పట్టుదలగా ఉన్నారు అయితే ఈ విషయం విన్న జగన్ మాత్రం వారందరికీ గట్టిగానే కౌంటర్ వేశాడు.

ఏ సోషల్ మీడియాలో అయితే చిరంజీవి 3 రాజధానులు కి వ్యతిరేకంగా మాట్లాడాలని… అమరావతి కి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో అదే సోషల్ మీడియాలో రాజకీయాలలో లేని చిరంజీవి ని ప్రశ్నించే ఉద్దేశం ఉన్న మీకు ఎమ్మెల్యేగా ఉన్న హీరో బాలకృష్ణను ఈ విషయంపై ఎందుకు స్పందించమని డిమాండ్ చేయరని వైసీపీ మద్దతుదారులు అడిగారు. బాలకృష్ణ కూడా ప్రముఖ సినీ నటుడు కానీ ఈ విషయంలో మాత్రం రాయలసీమ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ఇప్పుడు చిరంజీవికి బాలకృష్ణకి లింక్ పెట్టేసిన జగన్ చిరంజీవి అభిమానులగా చెప్పుకునే వైసీపీ కార్యకర్తల చేత సోషల్ మీడియాలో కౌంటర్ పోస్ట్ వేయించి వారికి సరైన సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news