పోలీసులే చంపారు : రాజు కుటుంబ సభ్యుల ఆరోపణ

-

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఘట్ కేసర్ వరంగల్ రైల్వే ట్రాక్ పై నిందితుడి మృతదేహం లభించింది. నిందితుడి చేతి పై ఉన్న టాటూ ఆధారంగా పోలీసులు బాడీని గుర్తించారు. అయితే రాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన పై అతని కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. అమర్ రాజు ను పోలీసులే హత్య చేసి ఉంటారని అతడి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసారు.

ముందే చంపేసి… ఆ తర్వాత రైలు పట్టాలపై పడేసి ఉంటారని వారు సంచలన ఆరోపణలు చేశారు. రాజు చేసింది తప్పేనని… అయితే ఆత్మహత్య చేసుకుని ఉండదని వారు తెలిపారు. రాజు రేప్ చేశాడు అంటే తాము నమ్మే వాళ్లని కాదని… చిన్నారి మృతదేహం రాజు ఇంట్లో దొరికిందని నమ్ముతున్నానని చెప్పారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అటు పోస్ట్ మార్టం కోసం రాజు మృతదేహన్ని.. వరంగల్ ఎంజీఎం కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news