BREAKING: రామోజీరావు ,శైలజ కిరణ్ లను 7 గంటలుగా విచారిస్తున్న CID…

-

గతంలో మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో మనీ లావాదేవీలు దారి మళ్ళిన కేసులో CID రామోజీరావు మరియు శైలజా కిరణ్ లపై కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ లో వీరిని A1 మరియు A2 లుగా చేర్చింది. కాగా గత నెలలో వీరిద్దరికీ CID విచారణ కోసం వారి ఇంటి దగ్గర కానీ, లేదా CID ఆఫీసులో కానీ విచారణకు సిద్దంగా ఉండాలని నోటీసులు ఇచ్చింది. అందులో భాగంగా ఇవ్వాళ ఉదయం నుండి వీరిని విచారించడానికి జూబిలీ హిల్స్ లోని వీరి నివాసానికి సీఐడీ బృందం వెళ్ళింది. కాగా దాదాపుగా 7 గంటల నుండి వీరిద్దరినీ సీఐడీ ఎస్పీ అమిత్ బర్ధర్ ఆధ్వర్యంలో మరియు సీఐడీ లీగల్ అడ్వైజర్ సమక్షంలో విచారణ కొనసాగుతోంది.

ఇప్పటి వరకు జరిగిన విచారణలో కొన్ని కీలక సమాచారం మరియు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇంకా ఎంతకాలం ఈ విచారాలు సాగుతాయో ? ఎప్పుడు ఈ కేసు క్లోజ్ అవుతుందో చూడాలి. మరి ఎటువంటి సమాచారం వీరి నుండి లభ్యం అయింది అన్న విషయం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news