పులివెందులలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. 8 మందికి గాయాలు

-

కడప జిల్లా వైసీపీ లో వరుస వివాదాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. సీఎం కు సొంత జిల్లాలో ఆ పార్టీకి బల అవ్వాల్సింది పోయి కార్యకర్తలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నారు. తాజాగా కడప జిల్లాలో వరుసగా మూడో రోజు కూడా కార్యకర్తల మధ్య ఘర్షణల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వీరన్నగట్టుపల్లె లో వైసీపీ కి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.

వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా వారందరిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఇరు వర్గాల మీద ఇడుపులపాయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ అంశాల మీద పార్టీ దృష్టి పెట్టాలని నేతలు కోరుతున్నారు. లేదంటే రోజూ ఇలాగే జరుగుతూ ఉంటే జనాల్లో పార్టీ పలుచన అవుతుందని వారు బాధ పడుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news