జగన్ ని పాబ్లో ఎస్కో బార్ తో పోల్చిన సీఎం చంద్రబాబు

-

డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలనేవిధంగా జగన్ మాట్లాడుతున్నారు.. పాబ్లో ఎస్కో బార్ లా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జగన్ పర్యటన రద్దు పై మీడియా సమావేశంలో మాట్లాడారు. అసలు నెయ్యి కల్తీనే జరుగలేదంటారు జగన్.  తిరుమల వెళ్లొద్దని జగన్ ని ఎవ్వరు అడ్డుకోలేదని, నోటీసులు ఇవ్వలేదని, ఇస్తే చూపించాలన్నారు. మాజీ సీఎంను నన్నే రానివ్వడం లేదు.. దళితుల పరిస్థితి ఏంటి..? జగన్ అబద్దాలు చెప్పారు. అసలు  దళితులను రానివ్వడం లేదని ఎవరూ చెప్పారని ప్రశ్నించారు.

సెక్షన్ 30 ప్రకారం.. 10 మంది గుమి గూడవద్దని నోటీసులు ఇచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం పై దాడి చేస్తే చర్యలు లేవు. జగన్ కి విశ్వసనీయత లేదు. పంది కొవ్వు బంగారం.. నెయ్యి రాగి అని ఓ లాయర్ అన్నారు. ఈ మాటలు వింటుంటేనే విడ్డూరంగా ఉంది. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వేంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకోవడం తప్పు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news