జవాన్ జశ్వంత్‌ రెడ్డి కుటుంబానికి.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్

-

గుంటూరు : ఉగ్రవాదులతో కాల్పుల ఘటనలో మృతి చెందిన జవాను జశ్వంత్ రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం వై.ఎస్. జగన్. ఉగ్రవాదులపై పోరులో కశ్మీర్‌లో ప్రాణత్యాగం చేసిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసిన జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనదన్నారు జగన్.

జవాన్‌ జశ్వంత్ చూపిన అసమాన ధైర్య సాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నారని వెల్లడించారు. జవాను జశ్వంత్‌ రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.  కాగా..  జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రమూకలు జరిపిన ఎదురు కాల్పుల్లో గుంటూరు జిల్లాకు చెందిన జవాన్‌ మరుపోలు జశ్వంత్‌ రెడ్డి ( Jashwant Reddy) (23) వీర మరణం పొందిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న జశ్వంత్‌ రెడ్డి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. జశ్వంత్‌ రెడ్డి స్వస్థలం బాపట్ల మండలం దరివాడ కొత్త పాలెం గ్రామం.

Read more RELATED
Recommended to you

Latest news