ఈ నెల 15 న చిలకలూరిపేటలో జగన్ పర్యటన

-

ఈ నెల 15న చిలకలూరిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట రూరల్ మండలం లింగంగుంట్ల గ్రామంలో పర్యటించి ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని.

ఇక ఈ కార్యక్రమంలో మంత్రి వెంట వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యం. టి కృష్ణబాబు గారు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్ గారు,ఆరోగ్యశ్రీ సీఈఓ హరింద్ర గారు,జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు,జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు,జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి శోభారాణి గారు,మరియు పలువురు అధికారులు,ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news