రోడ్ల గుంత‌ల‌పై జ‌గ‌న్ ప్లెక్సీలు.. ఫోటోలు వైర‌ల్‌ !

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోడ్ల ప‌రిస్థితులు ఎలా ఉంటాయో మ‌న‌కు తెలిసిందే. ఎప్ప‌టి నుంచో ఏపీ రోడ్ల ప‌రిస్తితుల‌పై ప్ర‌తి ప‌క్షాలు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు చేస్తూ నే ఉన్నాయి. అయితే.. ఇవాళ ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో.. కొన్ని వివాద‌స్ప‌ద ప్లెక్సీలు వెలుగులోకి వ‌చ్చాయి.
తూర్పుగోదావరి అనపర్తి కెనాల్ రోడ్డు మరమ్మత్తులు చెయ్యాలంటూ వివాదాస్పద ప్లెక్సీలు పెట్టారు కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.

జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ గోతుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనపర్తి – బలభద్రపురం మధ్య పలుచోట్ల సి.ఎం. జగన్ ఫోటోలతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. ఆ ఫ్లెక్సీలు వివాదాస్పదంగా ఉండటంతో రోడ్డుపై ప్లెక్సీలను తొలగించారు అనపర్తి పోలీసులు. స్వాధీనం చేసుకున్న ప్లెక్సీలను వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరళించారు. తెల్లవారుజాము సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news