రైతులకు సీఎం జగన్ శుభవార్త.. పంట పొలాల్లో ఉచితంగా బోర్లు.!

-

ఏపీ రైతులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయదారులకు ఉపకరించేలా పంట పొలాల్లో ఉచితంగా బోర్లు వేయాలని నిర్ణయించింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని వెల్లడించింది. అర్హత కలిగిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు నకళ్లతో గ్రామసచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ap cm jagan mohan responds to a heinous incident happened in srikakulam
 

ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునేవారికి కొన్ని విధివిధానాలు, అర్హతలు రూపొందించారు. రైతుకు కనీసం రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి. ఒకవేళ తానొక్కడికే అంత భూమి లేకపోతే, తన పొలం పక్కనున్న రైతులతో కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్పటికే బోర్లు ఉన్న పొలాలను ఈ ఉచిత పథకం నుంచి మినహాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news