నేడు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ వరుస భేటీలు

-

ఢిల్లీ వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి… వరుస భేటీలతో ఫుల్‌ బిజీ అయ్యారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ లాంటి తదితరులను కలిసిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి… ఈ రోజు మరో కొంత మంది కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.


ఇవాళ ఉదయం 9.30 గంటలకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. అలాగే.. ఉదయం 11 గంటలకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ తో భేటీ కానున్నారు సీఎం జగన్. మద్యాహ్నాం 12 గంటలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో సీఎం జగన్‌ మోహన రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం… నేరు ఏపీకి తిరిగి రానున్నారు సీఎం జగన్‌. కాగా.. నిన్న ప్రధాని మోడీ తో భేటీ అయిన సీఎం జగన్‌… ఏపీ సమస్యలపై చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news