ఇవాళ హైదరాబాద్ కు ఏపీ సీఎం జగన్

-

అమరావతి : ఇవాళ హైదరాబాద్ కు మరోసారి రానున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్. అనంతరం.. పదకొండున్నర గంటల ప్రాంతంలో హైటెక్స్ లోని కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు.

ఇక ఈ హైదరాబాద్‌ నగర పర్యటనలో.. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి. ఈ వివాహానికి కుటుంబ సమేతంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది.

ఇక వివాహ వేడుక పూర్తి అయిన అనంతరం.. మూడు గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు జగన్. ఈ వివాహ వేడుకలో.. టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేతలు, ఇతర వ్యాపార వేత్తలను సీఎం జగన్‌ కలిసే చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. మూడు రోజుల కిందట ముచ్చింతల్‌ గ్రామానికి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news