ఎయిడ్స్ బాధితులకు సీఎం జగన్ శుభవార్త

-

ఎయిడ్స్ బాధితులకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పాడు. ఎయిడ్స్ బాధితులను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితుల హక్కుల రక్షణ కోసం అంబుడ్స్ మన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

 

హెచ్ఐవి బాధితులకు చికిత్స ఇతర విషయాల్లో వివక్ష లాంటి సమస్యలు ఎదురైతే అంబుడ్స్ మన్ ద్వారా న్యాయం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2018 లో ఈ చట్టాన్ని తీసుకురాగా, ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అంబుడ్స్ మన్ నియామకాలు జరగనున్నాయి. దీంతో ఏపీ ఎయిడ్స్ బాధితులకు ఊరట కలగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news