మహిళలకు శుభవార్త..నేడే వైఎస్సార్‌ సున్నావడ్డీ మూడో విడత డబ్బులు విడుదల

-

అమరావతి : ఇవాళ ఒంగోలులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే…ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పీవీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వైఎస్సార్‌ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని ఈ పథకం ద్వారా విడుదల చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే దాదాపు కోటి మంది మహిళలకు ఖాతాల్లోకి సున్నా వడ్డీ పథకం కింద 1261 కోట్లను సీఎం జగన్ ఒంగోలు నుంచి జమ చేయనున్నారు. ఈ సొమ్ము తో ఇప్పటిదాకా 3600 15 కోట్ల ను మహిళలకు అందించినట్లు అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news