రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్…!

-

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గమ్మని దర్శించుకోనున్నారు సీఎం జగన్.రేపు మూల నక్షత్రం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అమ్మవారికి పట్టు వస్త్తాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3:30గంటలకు ఇంటి నుంచి బయలుదేరి 3:40గంటలకు దుర్గగుడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 4 గంటలకు తిరిగి సీఎం క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుంటారు.

సీఎం పర్యటన నేపథ్యంలో దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఏర్పాట్ల పై అధికారులతో ఫోనో లో సమీక్షించారు. మంత్రి వెల్లంపల్లి కరోనా తో తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఇంటి వద్దనుంచే అధికారులకు తగు సూచనలు చేశారు. గత మూడు రోజులుగా చేస్తున్న ఏర్పాట్లు భక్తుల విషయంలో తీసుకున్న జాగ్రత్తల గురించి అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు మంత్రి వెల్లంపల్లి.

Read more RELATED
Recommended to you

Latest news