తెలంగాణలో రేపటి నుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రములో దసరా వరకు అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్ లకి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామ చంద్రన్ లేఖ రాశారు. రేపటి నుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దసరా తర్వాత పరిస్థితి లను బట్టి పరీక్ష తేదీల పై నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇక ఇప్పటికే హైదరాబాద్‌ ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తాయి. మళ్ళీ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం మొదలవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిన్నా మొన్నా కురిసిన వర్షం దెబ్బకు లోతట్టు ప్రాంతాలను మరోసారి వరద ముంచెత్తింది.

Read more RELATED
Recommended to you

Latest news