మాజీ మంత్రి కుతూహలమ్మ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తిరుపతిలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్‌ తరఫున చిత్తూరు జెడ్పీ చైర్ పర్సన్ గా రాజకీయ జీవితం ఆరంభించారు.

చాలా కాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. 1985లో వేపంజేరి (ప్రస్తుతం జీడీనెల్లూరు) నియోజకవర్గం నుంచి గుమ్మడి కుతూహలమ్మ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే మాజీ మంత్రి కుతూహలమ్మ మృతిపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ మృతికి సంతాపం తెలియజేసిన సీఎం జగన్..కుతూహలమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news