వచ్చే ఎన్నికల్లో టికెట్ లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో మరో ఆరు నెలల కాలంలో ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నే మళ్ళీ గెలుస్తుందని ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తున్నారు. ఇక తాజాగా ఎన్నికల్లో టికెట్ ల కేటాయింపు గురించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కొందరికి టికెట్ లు రాకపోవచ్చు… ఈ విషయాన్ని నేతలు అంతా మంచి మనసుతో అర్ధం చేసుకోవాలని సూచించారు. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో మాట్లాడిన జగన్ ప్రతి ఒక్కరికీ టికెట్ వస్తుందని అనుకోకండి.. మీకు టికెట్ రానంత మాత్రాన నా వాళ్ళు కాకుండా పోరు అంటూ చాలా సున్నితంగా , ఎంతో పాజిటివిటీ తో మాట్లాడారు. ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసి కట్టుగా ఉండి

వైసీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అంటూ జగన్ చెప్పిన తీరుకు చాలా మంది ఫిదా అయ్యారని చెప్పవచ్చు. మరి జగన్ టికెట్ ల విషయంలో ఇంత టెన్షన్ పెడుతున్నారంటే ఎవ్వరికి షాక్ ఇవ్వనున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news