చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుంది..5 ఏళ్లు మీ రక్తం తాగుతుంది -సీఎం జగన్‌

-

చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుంది..5 ఏళ్లు మీ రక్తం తాగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్‌. టంగుటూరులో సీఎం జగన్ మాట్లాడుతూ..నాయకుడంటే ప్రజల్లో నమ్మకముండాలి..ఒక మాట చెప్తే చేస్తాడన్న నమ్మకం ఆ నాయకుడిపై ఉండాలని పేర్కొన్నారు. ఈ 58 నెలల కాలంలో సీఎంగా మీకు మంచి మీ అందరి సమక్షంలో ఒకవైపు ఉన్నా..మరోవైపు గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా పేదలకు మేలు చేయని పెత్తందారీ ఉన్నాడని ఫైర్‌ అయ్యారు.

జగన్ కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ముగింపు అని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుంది.. ఐదేళ్లు మీ రక్తం త్రాగుతుంది..ఎవరు వంచన చేసేవారో.. ఎవరు న్యాయం చేశారో చూద్దామా అని అడుగుతున్నానని వెల్లడించారు. 2004లో జాబు రావాలంటే బాబు రావాలని చంద్రబాబు చెప్పిన మాటలు విని ఓటేస్తే ఏం జరిగిందని ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చాం..స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొత్తం నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తే.. మేము వచ్చిన తర్వాత 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news