రేపు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం జగన్‌

-

రేపు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి విజయవాడ కు వెళ్లనున్నారు. ఈ పర్యటన లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌. విజయవాడ పటమట దత్తా నగర్‌ లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు ఏపీ సీఎం జగన్.

ఈ పర్యటన లోనే భాగంగానే… రేపు ఉదయం 10.30 గంటలకు ఆశ్రమానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్‌.  ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శించనున్న సీఎం జగన్… అవధూత దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందునితో భేటి కానున్నారు.

అనంతరం ఉదయం 11.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. కాగా.. నాలుగు రోజుల కిందట… తిరుమల శ్రీ వారు మరియు విజయ వాడ కనక దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news