సీఎం జగన్ తొలి విదేశీ పర్యటన..పెట్టుబడులే ప్రధాన అజెండాగా…!

-

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ తొలి అధికారిక విదేశీ పర్యటన కు వెళ్లనున్నారు.ముఖ్యమంత్రి జగన్ వారం రోజుల విదేశీ పర్యటన ఖరారయింది.వచ్చే నెల 22వ తేదీ నుండి ఆయన దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.జగన్ సీఎం అయిన తర్వాత లండన్…అమెరికా వెళ్ళినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన గానే పరిమితం అయింది.కాగా ఇప్పుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కు సీఎం జగన్ వెళ్లనున్నారు.దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా సంక్షేమం పేరుతో..పథకాల అమలుపై నే ఎక్కువగా ఫోకస్ చేసిన సీఎం, రాష్ట్రంలో పెట్టుబడులు…పరిశ్రమల విషయంలో అడుగు ముందుకు వేయలేదని అంటూ రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు.ఈ మూడేళ్ల కాలంలో ఒక్క పెట్టుబడి ఏపీకి రాలేదంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.ముఖ్యమంత్రి పర్యటన ఆంధ్రప్రదేశ్ కి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news