అకాల వర్షాలపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అకాల వర్షాలపై సీఎం వైయస్‌.జగన్‌ సీఎంఓ అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాల్సిందిగా సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు.

వారం రోజుల్లో ఈ ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎన్యుమరేషన్‌ పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. భారీవర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news