మళ్లీ జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్..షెడ్యూల్ ఇదే

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మళ్లీ దూకుడు పెంచారు. గతంలో లాగా కాకుండా.. ఆయన స్వయంగా రంగంలోకి దిగి ప్రతి పక్షాలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పక్షాలను చీల్చి చెండాడుతూనే.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేస్తున్నారు. అయితే.. తాజాగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మళ్ళీ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.

కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈనెల 25న గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 29న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సెప్టెంబర్ 10న జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ఖరారైనట్లు సిఎంఓ కార్యాలయం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news