ఒకే ఫ్రేమ్ లో సీఎం కేసీఆర్, తమిళి సై..ఫోటో వైరల్

-

రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా శీతాకాల విడిది కోసం ఐదు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది. సోమవారం సాయంత్రం హాకీంపేట వైమానిక కేంద్రంలో ఆమెకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. అనంతరం అక్కడే స్వాగత కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ ల చైర్మన్లు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్రపతికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.అయితే, ఈ సందర్భంగా గవర్నర్‌ మరియు సీఎం కేసీఆర్‌ గారు చాలా సన్నిహితంగా కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news