BREAKING : బాంబ్ సైక్లోన్‌తో తెలుగు దంపతులు మృతి

-

అమెరికా బాంబ్ సైక్లోన్ లో తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు. న్యూ జెర్సీలోని ఓ ఐస్ లేక్ లో ఫోటోలు దిగేందుకు గుంటూరు జిల్లా పేదనందిపాడు మండలం, పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ, భార్యా హరిత, స్నేహితుడు వెళ్ళగా, గడ్డ కట్టిన ఐస్ కుంగడంతో వాళ్లు కింద పడిపోయారు.

సహాయక బృందాల గాలింపులో హరిత మృతదేహం లభించింది. పిల్లలు ఒడ్డునే ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా, బాంబ్ సైక్లోన్ తో అమెరికా, కెనడాలు వనికి పోతున్నాయి. USA లో 1/3 వంతు ప్రజలు దీని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. 60 మందికి పైగా చనిపోగా, న్యూయార్క్ రాష్ట్రంలో 28 మంది మృతి చెందారు. 15 లక్షల మంది కరెంటు లేక అవస్థపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news