పోడు భూములపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం..!

-

పోడు భూముల సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ నేడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశం లో అన్ని జిల్లాల కలెక్టర్ లు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు హాజరుకానున్నారు. అంతే కాకుండా పలువురు ముఖ్య అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. 11:30 నిమిషాలకు ప్రగతి భవన్ లో ఈ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

KCR-TRS
KCR-TRS

పోడు భూముల ఆక్రమణలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ములుగు లో పోడు భూములు ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారు అనే దానిపై అధికారులు ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ తో అధికారులు ఈ సర్వే నిర్వహించారు. దీనికి సంభందించిన నివేదికను సీఎం కు అందజేస్తారు. 2005 తరవాత పోడు భూములను మళ్లీ క్రమబద్ధీకరిస్తే జరిగే నష్టం…పర్యావరణ నిపుణులు వాదనలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news