నేడు హుజూర్ నగర్ లో కేసీఆర్ పర్యటన..

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ హుజూర్ నగర్ లో పర్యటించనున్నారు. 40 వేల మెజారిటీతో విజయాన్ని అందించిన హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞత సభలో పొల్గొనున్నారు. టీఆర్ఎస్‌కు అఖండ విజయాన్ని అందించిన హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

లక్ష మందికి పైగా జనం సభకు హజరవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌ నుండి రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్‌తో హుజూర్‌నగర్‌ సభకు చేరుకోనున్నారు సీఎం కేసీఆర్‌. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో12 మంది ఎమ్మెల్యేలకు గాను 11 మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు సభకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news