దత్తత గ్రామం వాసాల మర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్

-

కాసేపటి క్రితమే దత్తత గ్రామం వాసాల మర్రి గ్రామానికి ముఖ్య మంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. ఉదయం 11:30 ప్రాంతంలో ప్రగతి భవన్‌ నుంచి బయలు దేరిన సీఎం కేసీఆర్‌.. కాసేపటి క్రితమే దత్తత గ్రామం వాసాల మర్రి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు సీఎం కేసీఆర్‌ కు స్వాగతం పలికారు.

కాగా.. ఇటీవల వాసాలమర్రి లో గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన సీఎం కేసీఆర్… ఆ తర్వాత గ్రామ సభ నిర్వ హించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో 20 సార్లు అయినా వాసాలమర్రి కి వస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. సీఎం ఆ గ్రామం లోని దళితవాడలో పర్యటించడం తోపాటు రైతు వేదికలో 130 మంది తో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి. గ్రామానికి సీఎం కేసీఆర్ రానున్న తరుణంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వాసాలమర్రి లోనూ సందడి వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news