రేవంత్ రెడ్డికి చిప్ప కూడు తిన్నా సిగ్గు రాలేదు : సీఎం కేసీఆర్

-

రేవంత్ రెడ్డికి చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కోస్గిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. 24 గంటల కరెంట్ కావాలంటే మళ్ళీ కొడంగల్ లో నరేందర్ రెడ్డి, గెలిపించుకోవాలి..
కాంగ్రెస్ వాళ్లు ధరణి తిస్తామంటుంన్నారు. ధరణి తీస్తే రైతుబందు ఏట్లోస్తది. ప్రజలు మీరే ఆలోచన చేయాలి.కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యం అవుతుంది. నరేందర్ రెడ్డి కొడంగల్ లో ఎన్నో పనులు చేసిండు..రేవంత్ రెడ్డి ఉట్టి ఫాల్త్ మాటలు మాట్లాడే వ్యక్తి కావాలో మీరే తేల్చుకోండి.

పట్ట పగలు డబ్బు సంచులతో ఓటుకు నోటులో దొరికిన దొంగ..ఏకాన పని చేయని ఫాల్త్ రేవంత్ రెడ్డి కావాలో మీరే నిర్ణయం చేసుకోండి..
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు పొయ్యేది లేదు. ఉత్త గ్యాస్ మాటలు తప్ప. రేవంత్ రెడ్డికి నీతి లేదు,నియ్యథ్ లేదు. ఇటువంతొడు కొడంగల్ కు అవసరమా.. పేదింటి ఆడపిల్లల పెళ్లి జరిగితే లక్ష రూపాయలు ఇస్తున్న ఘనత తెలంగాణదే.. ఈకాంగ్రెస్ దొంగలు ఏమైనా అభివృద్ధి పనులు చేశాడా.కొడంగల్ లో రేవంత్ రెడ్డి ని లాగు ఉడేదాక ఓడగొట్టలే. నరేందర్ రెడ్డి ని గెలిపించండి..గెలిచినంక కొడంగల్ కు వస్తా..కొడంగల్ లొనే ఒక రోజు ఉంట..ప్రజాల్లోనే ఉంటానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news