కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులా : బండి సంజయ్ కి కెసిఆర్ కౌంటర్

-

ధాన్యం కొనుగోలు అంశంపై అధికార టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు అంశంపై.. కేంద్రంపై నిన్న కేసీఆర్ మండిపడగా.. దానికి కౌంటర్ గా బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే బండి సంజయ్ ఇవాళ చేసిన వ్యాఖ్యలకు మరోసారి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు సీఎం కేసీఆర్.

కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపి పార్టీ అని ప్రశ్నిస్తే దేశద్రోహి ముద్ర వేస్తారా ? అని నిలదీశారు సీఎం కేసీఆర్. ఇవాళ ప్రెస్ మీట్ లో బండి సంజయ్… మొత్తం సొల్లు పురాణం మాట్లాడారని మండిపడ్డారు. బిజెపి దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీ గా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను మద్దతు తెలిపిన అప్పుడు దేశభక్తులుగా కనిపించి… ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహుల ముద్ర వేస్తున్నారని నిప్పులు చెరిగారు. బార్డర్ లో చైనాలో దురాక్రమణకు పాల్పడుతుందని.. మాట్లాడితే దేశద్రోహులు అంటున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news