బ్రేకింగ్ : యశోద ఆస్పత్రిలో చేరిన సీఎం కేసీఆర్ !

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యశోద ఆసుపత్రికి వెళ్లారు. సిటీ స్కాన్ అలాగే ఇతర వైద్య పరీక్షల కోసం సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి కి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. ఉదయం నుంచి కాస్త అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్… హుటాహుటిన యశోదా ఆసుపత్రికి వెళ్లారని ప్రగతి భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రి లోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. మరో గంటపాటు యశోద ఆస్పత్రి లోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు. యశోద ఆసుపత్రికి వెళ్లనున్న నేపథ్యంలోనే ఇవాళ సీఎం కేసీఆర్ తన యాదాద్రి టూర్ ను రద్దు చేసుకున్నారు.

సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రికి వెళ్లనున్నారని నిన్న ప్రగతి భవన్ అధికారులు అధికారికంగా ప్రకటన చేశారు. అయితే సీఎం కేసీఆర్ కు అస్వస్థత నెలకొన్న నేపథ్యంలో… ఆ టూర్ వాయిదా పడినట్లు మరోసారి స్పష్టం చేశారు. ఇక సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లడం పై టిఆర్ఎస్ పార్టీ నేతల్లో అలాగే ఆయన అభిమానులు కాస్త ఆందోళన నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news