జనగాంలో రేపు కేసీఆర్ టూర్..నేరుగా రైతులతో…!

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనగాం పర్యటన ఖరారైంది. రేపు ఉదయం హెలీక్యాప్టర్‌ ద్వారా జనగాం నియోజకవర్గం కొడకండ్ల మండలానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్మాణం పూర్తయిన రైతు వేదికను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్నారు. అంతేకాకుండా స్థానిక వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో సుమారు 5 వేల మంది రైతులతో ఏర్పాటుచేసే సభలో కేసీఆర్‌ మాట్లాడతారు.

ఈ సందర్భంగా రైతు వేదికల ముఖ్య ఉద్దేశాలను ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి హాజరయ్యే రైతు బంధు జిల్లా, మండల, గ్రామ కమిటీల సభ్యులతో పాటు రైతులకు, తద్వారా రాష్ట్రంలోని రైతాంగానికి సీఎం వివరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,604 వ్యవసాయ విస్తరణాధికారుల క్లస్టర్లలో 2 వేలకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో రైతు వేదికల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.573 కోట్లు ఖర్చు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news