రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌.. షెడ్యూల్ ఇదే

-

పుణ్య క్షేత్రమైన యాదాద్రి కి మరోసారి తెలంగాణ రాష్ట్ర కె.చంద్రశేఖర్ రావు వెళ్లనున్నారు. రేపు (మంగళవారం, 19 అక్టోబర్) యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెళుతున్న నేపథ్యంలో… ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తి స్థాయి లో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని మరోసారి రేపటి పర్యటన లో సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు.

KCR-TRS
KCR-TRS

యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించి వున్నారు. ఇక ఈ పర్యటనలో యాదాద్రి లోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటించనున్నారు. పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సిఎం కెసిఆర్ ప్రకటించనున్నారు. కాగా… వచ్చే డిసెంబర్‌ లోనే యాదాద్రి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news