ఈ నెల 27న విజయవాడ, మంగళగిరిలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

-

అమరావతి : ఈ నెల 27న విజయవాడ, మంగళగిరిలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఉండనుంది. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ 1 టౌన్‌ వించి పేటలో షాజహుర్‌ ముసాఫిర్‌ ఖానా, ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.
ఆ తర్వాత ముస్లిం మత పెద్దలతో భేటీ కానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

ఇంధిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అదే రోజు రాత్రి 7.35 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌ కు చేరుకోనున్నారు సీఎం జగన్. గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news