నందమూరి అభిమానులకు శుభవార్త..బోయపాటి-బాలయ్య కాంబోలో మరో సినిమా!

-

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆయన సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక బాలయ్య- యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే చాలు..అభిమానులు సంబురాలు చేసుకోవాల్సిందే. వీరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బాక్సాఫీసు రికార్డులన్నిటినీ తిరగరాశాయి. ‘సింహ , లెజెండ్, అఖండ’ ఈ మూడు చిత్రాలు బాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ నిలిచియాని చెప్పొచ్చు.

ఇటీవల విడుదలైన ‘అఖండ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అఖండమైన ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని అభిమానులు కోరుకున్నారు. అలా ‘అఖండ-2’ రాబోతున్నదన్న ప్రచారం జరిగింది. కానీ, ఈ విషయమై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..బోయపాటి-బాలయ్య కాంబోలో మరో మూవీ రాబోతున్నది. అయితే, ఈ సారి చేసే సినిమా ‘లెజెండ్’ మాదిరిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండాలని బాలయ్య సూచించినట్లు టాక్.

బాలయ్య సూచన మేరకు బోయపాటి శ్రీను ప్రస్తుతం స్టోరిపైన కాన్సంట్రేట్ చేస్తు్న్నట్లు తెలుస్తోంది. ఇందుకు కొంత టైం పడుతుందని, ఆ లోపు బోయపాటి రామ్ పోతినేనితో చిత్రం పూర్తి చేయాలని అనుకుంటున్నారు. బాలయ్య సైతం గోపీచంద్ మలినేని సినిమా కంప్లీట్ చేయనున్నారు.

అలా వీరిరువురి కమిట్ మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా వీరి కాంబోలో పిక్చర్ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకుని నందమూరి అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘అఖండ’ను మించిన విజయం రాబోయే చిత్రం సాధించాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news