జగన్ సర్కార్ గుడ్ న్యూస్ : 3.7 లక్షల మందికి లబ్ది

-

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రేపు “జగనన్న తోడు పథకం” కింద సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు బదిలీ చేయనున్నారు సీఎం జగన్. ఈ పథకం కింద చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణం ఇవ్వనుంది సర్కార్. వరసగా రెండో ఏడాది కూడా ఈ పథకాన్ని అమలు చేయనుంది ఏపీ సర్కార్. ఈ పథకం ద్వారా 3.7 లక్షల చిరు వ్యాపారులకు లబ్ది జరుగనుంది.

ఈ పథకం కోసం రూ.370 కోట్లు వెచ్చించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా తీసుకున్న రుణాన్ని తిరిగి 12 ఈఎంఐల్లో లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది. రూ.10 వేల రుణానికి ప్రతి నెల వడ్డీని కూడా లబ్దిదారులు చెల్లించాలి. అయితే ప్రతి మూడు నెలలకు ఆ వడ్డీని సర్కార్ తిరిగి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news