కేంద్రమంత్రికి సీఎం జగన్‌ లేఖ మరో లేఖ…కారణమిదే

-

అమరావతి : ‘దిశ’ ఆమోదం కోసం కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి సీఎం జగన్‌ ఆరు పేజీల లేఖ రాశారు. మహిళలు, పిల్లల పై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. వీరి భద్రత కోసం దిశ చట్టం తీసుకుని వచ్చామని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్. ఏపీ దిశా బిల్లు-2020, ఏపీ దిశా క్రిమినల్ లా బిల్లు-2019 పై అభిప్రాయాలు ఇవ్వాల్సింది కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ను కోరింది కేంద్ర హోంశాఖ.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ లేఖకు ప్రాధాన్యత ఏర్పడింది. అవసరమైతే అధికారులు స్వయంగా వచ్చి బిల్లులోని అంశాలు వివరిస్తారని లేఖలో స్పష్టం చేశారు జగన్. కాగా…ప్రధాని మోడీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి నిన్న ఏపీ సీఎం జగన్‌ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. కృష్ణా జలాల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు వేరు వేరుగా ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news