నన్ను లేకుండా చేయాలని కూటమి కుట్రలు: సీఎం జగన్

-

ల్యాండ్ టైటిలింగ్ యాక్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించడమే ఈ చట్టం ఉద్దేశం అని అన్నారు. ఇటీవల భూవివాదాలు పెరిగి యజమానులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వ గ్యారంటీతో సంస్కరణ తీసుకురావాలనేది మా ఆలోచన అని తెలిపారు. ఇది తెలియని మూర్ఖులు దుష్ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

‘కూటమి నేతలు నాపై కుట్రలు చేస్తున్నారు. ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం లేదు. అమల్లో ఉన్న పథకాల డబ్బులు కూడా ప్రజలకు చేరకుండా ఆపుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారు. పేదలకు మంచి చేస్తున్న నన్ను లేకుండా చేయాలని కూటమి నేతలు కుతంత్రాలు పన్నుతున్నారు’ అని జగన్ ఫైరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news