ఘోరాతిఘోరం: పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న అమ్మాయిని కాల్చి చంపిన దుండగులు !

-

దేశంలో ఎక్కడ చూసినా అమ్మాయిల పట్ల దోరంగా ప్రవర్తించే ఆకతాయిల ఆగడాలను ఆపడం కుదరడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర ఘటన అందరినీ కన్నీళ్ల పర్యంతం చేసింది. యూపీ జలౌన్ లో ఒక కాలేజ్ అమ్మాయి బుద్దిగా పరీక్షలు రాసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా హత్యా చేయబడింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రోహిణి అనే కాలేజ్ అమ్మాయి తన కాలేజ్ లో పరీక్ష ముగించుకుని ఇంటికి పయనమై వెళుతున్న సందర్భంలో అప్పుడే అటుగా బైక్ లో వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై విచక్షణారహితంగా కాల్చడంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే రకపు మడుగులో పది చనిపోయింది.

ఈ ఘటనపై జలౌన్ జిల్లా ఎస్పీ ఇరాజ్ రాజా స్పందించారు, ఈ హత్యకు కారణమైన ఇద్దరినీ త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అయితే ఈ కేసులో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది, వీరికి ఆ అమ్మాయికి ఇంతకు ముందు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తే కేసు సాల్వ్ అయ్యేలా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news