రాజకీయాలంటే జనసేనకు కామెడీ అయిపోయింది: వైసీపీ

-

జనసేన ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్లపై వైసీపీ సెటైర్లు వేసింది. ‘మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ జనసేన పార్టీకి అంత కామెడీ అయిపోయాయి అని ఆసహనం వ్యక్తం చేసింది. ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్ షీట్లు చూసుకోండి’ అని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేసింది.

కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెనర్లను పవన్ కళ్యాణ్ నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్,మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి,సినీ- టీవీ నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, జబర్దస్త్ హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరిస్తారని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ పేరుతో ఒక లేఖ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news