సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ ని కించపరిచేే వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

-

సోషల్ మీడియా లో సీఎం కేసీఆర్ ని కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ దినేష్ చౌదరి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లో బిజెపి అల్లర్లకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫెస్బుక్ లో కించపరిచే పోస్టింగ్ లు పెట్టి వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఫెస్బుక్ వేదికగా కించపరిచే పోస్టింగ్ లు పెడుతున్నట్లు తెలిపారు.

బిజెపి పార్టీ దీని వెనక ఉండి ఇలాంటి సోషల్ మీడియా పేజీలు నడిపిస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ లో అల్లర్లు సృష్టించేందుకు ఈ తరహా చర్యలు చేపడుతున్నారని.. బిజెపి దేశంలో అస్థిరత, అల్లకల్లోలాలను సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ సమాజం వాటిని తిప్పికొడుతుందని.. ఈ తరహా చర్యలు బిజెపి మానోకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news