తెలంగాణ నుంచి నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

-

మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 36 మందితో తొలి జాబితా ప్రకటించింది. అందులో తెలంగాణకు చెందిన నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్- సురేశ్ షెట్కార్, నల్గొండ- కుందూరు రఘువీర్,చేవెళ్ల- సునీతా మహేందర్ రెడ్డి, మహబూబాబాద్- బలరాం నాయక్ పేర్లను ప్రకటించింది.

అంతేకాకుండా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ (కేరళ) నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు శివ రాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ టికెట్ కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news