ఆగస్టు 5వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్

-

ఆగస్టు 5వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. రికార్డు స్థాయి ధరల పెరుగుదల నిరుద్యోగ అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలకు చేయాలని కాంగ్రెస్ క్యాడర్ కు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ భవన్ వరకు ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించిన ఏఐసీసీ.. జిల్లాల స్థాయిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది. అలాగే కలెక్టరేట్ ల ముట్టడికి కూడా ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర రాజధానుల్లో పిసిసి ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాలను చేపట్టాలని పేర్కొంది. రాజ్ భవన్ ముట్టడిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎంపీలు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు పాల్గొననున్నారు. దేశ రాజధానిలో చలో రాష్ట్రపతి భవన్ పాల్గొననున్నారు లోక్సభ రాజ్యసభ ఎంపీలు. ప్రధానమంత్రి ఇంటి ముట్టడిలో పాల్గొననున్నారు సిడబ్ల్యుసి మెంబర్లు జాతీయ కాంగ్రెస్ నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news