తెలంగాణాలో జోరుగా కాంగ్రెస్ … ఈ దెబ్బతో ఎన్నికల్లో గెలిచేస్తుందా ?

-

తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు అయితే పీసీసీ చీఫ్ గా నియమించారో అప్పటి నుండి కాంగ్రెస్ ను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి కృషి అనితరసాధ్యం అని చెప్పాలి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ బాగా బలపడింది అని స్పష్టముగా తెలుస్తోంది. ఇక ఎన్నికలకు అయిదు నెలల సమయం మాత్రమే ఉన్నందున జోరుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరియు ఎన్నికలకు సమాయత్తం అవుతోంది కాంగ్రెస్. ఇక తాజాగా డిక్లరేషన్ లపై సైతం దృష్టి పెట్టడం విశేషం అని చెప్పాలి. రైతులు మరియు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది .. ఈ రోజునే దళిత, గిరిజన డిక్లరేషన్ ను కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక సెప్టెంబర్ లో మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ను కూడా విడుదల చేయనున్నారు.

ఇక త్వరలోనే ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇలా ఎంతో జోష్ గా తమ కార్యకలాపాలను పూర్తి చేసుకుంటూ ఎన్నికలకు వెళుతోంది. మరి ఇదే జోరులో ఎన్నికల్లోనూ గెలిచి కేసీఆర్ కు షాక్ ఇస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news